స్వర్ణ దేవాలయంలో పేలుడు - ఆరు రోజుల వ్యవధిలో మూడో ఘటన - ఐదుగురి అరెస్టు

Webdunia
గురువారం, 11 మే 2023 (12:33 IST)
పంజాబ్ రాష్ట్రం అమృతసర్‌లోని ప్రసిద్ధ స్వర్ణ దేవాలయంలో మరోమారు పేలుడు సంభవించింది. బుధవారం అర్థరాత్రి ఈ పేలుడు ఘటన జరిగింది. గత ఆరు రోజుల్లో జరిగిన మూడో ఘటన ఇది కావడం గమనార్హం. ఈ భారీ పేలుడుతో స్వర్ణ దేవాలయం ప్రాంతం దద్ధరిల్లిపోయింది. శ్రీగురు రాందాస్ నివాస్ సమీపంలో అర్థరాత్రి 12 గంటల సయమంలో ఈ పేలుళ్ళు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. 
 
ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ నైనిహాల్ సింగ్ స్పందిస్తూ, బుధవారం అర్థరాత్రి 12.15 గంటల నుంచి 12.30 గంటల మధ్య భారీ పేలుడు శబ్ధం వినిపించింది. ఇది మరో పేలుడు ఘటన. భవనం సమీపంలో శిథిలాలను కనుగొన్నాం. ఈ ఘటనపై పూర్తి విచారణ సాగుతోంది అని చెప్పారు. అయితే, గత ఆరు రోజుల వ్యవధిలో మూడో పేలుడు ఘటన. దీంతో ఈ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంతో తెలియక స్థానికులు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు, ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments