Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనానికి వెళ్లి చేపల కూర తిని.. హాయిగా నిద్రపోయాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (13:18 IST)
దొంగతానికి వెళ్లి చేపల కూర తిని మస్తుగా నిద్రపోయిన ఓ దొంగను జనాలు ఉతికేశారు. చోరీకి వెళ్లి.. ఆకలేసిందో ఏమో కానీ ఆ దొంగ ఆ ఇంట్లో వండిపెట్టిన చేపలకూర తిని హాయిగా నిద్రపోయాడు. అంతే.. జనాలకు చిక్కాడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లాలో సతీష్ అనే యువకుడు ఓ ఇంట్లో దొంగతనం చేయటానికి వచ్చాడు. 
 
ఏమేమీ నొక్కేద్దామా అనుకుంటూ ఇల్లంతా కలియతిరిగాడు. బంగారంగానీ.. విలువైన వస్తువులు ఏమీ కనిపించలేదు. ఏమీ దొరక్కపోవడంతో..  వంటింట్లోంచి ఘుమఘుమలాడే చేపల పులుసు కూర వాసన వచ్చింది. పాపం.. నోరూరింది. ఆగలేకపోయాడు. కూర రుచిగా వుండటంతో కడుపు నిండా లాగించేశాడు. డాబా మీదకెళ్లి హాయిగా నిద్రపోయాడు. 
 
ఇంతలో ఇంటి యజమాని నిద్రలేచాడు. ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులు చూసి దొంగతనం జరిగిందని భయపడిపోయాడు. ఇరుగు పొరుగు వారికి చెప్పాడు. దొంగ పారిపోయాడనుకుని సీసీటీవీ కెమేరాల పుటేజ్‌ను పరిశీలించారు.
 
చేపల కూరంతా తినేసి మేడమీదనుంచి దూకి పారిపోయి ఉంటాడని అనుకుంటూ.. మేడపైకి వెళ్లారు. అక్కడే నిద్రపోతున్న దొంగను చూసి షాకయ్యారు. ఆపై అతడ్ని లేపి.. చితకబాదారు. ఆపై పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments