Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు ఏమీ తెలియదు.. వారిని కొందరు ఉసిగొల్పుతున్నారు : హేమమాలిని

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (13:37 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో పాల్గొన్న అనేక మంది రైతులు ప్రాణాలు విడిచారు. రైతులు పడుతున్న పాట్లు చూసిన సుప్రీంకోర్టు ఈ సాగు చట్టాల అమలుకు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో ఈ సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై బాలీవుడ్ నటి, బీజేపీ రాజ్యసభ సభ్యురాలు హేమమాలిని స్పందించారు. 
 
కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా కొందరు రైతులను ఉసిగొల్పుతున్నారని, చట్టాల అమలు వల్ల వచ్చే నష్టాలేంటో రైతులకు తెలియవన్నారు. 'చట్టాలపై సుప్రీం స్టే విధించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రస్తుతమున్న వాతావరణాన్ని కాస్త మెరుగుపరుస్తుందని నా అభిప్రాయం. ఇన్నిసార్లు చర్చలు జరిగినా, రైతులు ఏకాభిప్రాయానికి రావడం లేదు. వారికి ఏం కావాలో కూడా వారికి తెలియదు. అంతేకాకుండా నూతన చట్టాలతో వచ్చే నష్టాలేంటో కూడా వారికి తెలియదు. ఎవరో కొందరు వ్యక్తులు నిరసన చేయమంటే రైతులు చేస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, వివాదాస్పదంగా మారిన మూడు సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు ఈ చట్టాలు అమలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే, ఈ విషయంలో ప్రభుత్వ వాదనలన్నింటినీ పక్కకు పెట్టిన కోర్టు - చర్చల్లో నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించి సమస్యకు ఓ పరిష్కారం సాధించేందుకు నలుగురు నిపుణులతో ఓ కమిటీని వేసింది. 
 
ప్రభుత్వంతో పాటు ఆందోళన చేస్తున్న లేదా చేయని రైతు సంఘాలన్నింటితో సంప్రదింపులు జరిపి రెండు నెలల్లోగా ఓ నివేదిక ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్ఏ బోబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవన్.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments