చెట్లపై కూర్చుని ఆన్‌లైన్ తరగతులు.. తేని విద్యార్థుల ఫోటోలు వైరల్

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (23:01 IST)
Theni
కరోనా కారణంగా ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంటర్నెట్ సిగ్నల్ దొరకని కారణంగా.. కొండపైకెక్కి.. అక్కడున్న ఎత్తైన చెట్లపై కూర్చుని ఆన్‌లైన్ తరగతుల ద్వారా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం, తేని జిల్లాలో చోటుచేసుకుంది. ఆన్‌లైన్ తరగతులను తేని విద్యార్థులు.. చెట్ల కింద కూర్చుని లేదా.. కొండపైనున్న ఎత్తైన వృక్షాలపై కూర్చుని వింటున్నారు. 
 
క్రూరమృగాలు సంచరించే కొండ ప్రాంతాలకు ఇలా విద్యార్థులు ఆన్‌లైన్ తరగతుల కోసం ప్రమాదమని తల్లిదండ్రులు వాపోతున్నారు. తేని జిల్లా, కడమలైగుండు ప్రాంతం కొండలతో కూడినది. ఈ కొండల చుట్టూ గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని విద్యార్థులు సెల్ ఫోన్లలో సిగ్నల్స్ దొరకని కారణంగా.. చెట్లపైకెక్కి ఆన్ లైన్ తరగతుల్లో పాల్గొంటున్నారు. 
 
ఇందుకోసం రోజూ నాలుగు కిలోమీటర్లు నడుస్తున్నారు. కరోనా కాలంలో ఇంటికే పరిమితం కాకుండా ఆన్‌లైన్ తరగతుల కోసం కొండ ప్రాంతాలకు వెళ్లి.. సిగ్నల్స్ కోసం వేచి వుండి మరీ పాఠాలను అభ్యసిస్తున్న తేని జిల్లా విద్యార్థులపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments