Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలీఫ్లవర్ పంట కోసిందనీ.. తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టిన కసాయి కొడుకు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (11:55 IST)
నవ మాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లి పట్ల ఓ కసాయి కొడుకు కర్కశంగా నడుచుకున్నాడు. తన పంట పొలంలో కాలీఫ్లవర్ పంట కోయడమే ఆ తల్లి చేసిన నేరం. దీంతో కన్నతల్లిని స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా చావబాదాడు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కియోంఝర్లోనిలోని సరపరి అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రంలోని సరపరి అనే గ్రామానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరికీ పెళ్ళిళ్లు కావడంతో వేర్వేరుగా ఉంటూ పొలం పనులు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. 
 
అయితే, చిన్న కుమారుడు శతృఘ్న మహంత (39) తన పొలం కాలీఫ్లవర్ పంటను సాగుబడి చేశాడు. దీంతో కన్నతల్లి కూర వండుకునేందుకు ఓ కాలీఫ్లవర్ కోసింది. ఈ విషయం తెలుసుకున్న కొడుకు.. తన అనుమతి లేకుండా కాలీఫ్లవరు ఎందుకు తెంపావని దుర్భాషలాడుతూ తల్లిని నిలదీశాడు. అంతటితే ఆగకుండా ఆమె వీధిలో కరెంట్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా చావబాదాడు. గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మహంతను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments