Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘాటెక్కిన ఉల్లి ధర

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (06:24 IST)
దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో ఉల్లి ధర రూ.100కు చేరింది. రైతుబజార్లలో కిలో రూ.75కు విక్రయిస్తుండగా, బయటి మార్కెట్లో మాత్రం వంద రూపాయలు పలుకుతోంది.

సెప్టెంబరు నుంచి జనవరి వరకు కర్నూలు జిల్లాతోపాటు, కర్ణాటక నుంచి ఉల్లి వస్తుంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు కర్నూలులోని పంట మొత్తం నాశనమైపోయింది.
 
దిగుమతులపై నిబంధనల సడలింపు
ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఉల్లి దిగుమతులపై నిబంధనలను సడలించింది. దేశీయంగా సరఫరాను పెంచి పెరుగుతున్న రిటైల్‌ ధరలను అదుపు చేయడానికి ఉల్లిపాయలను ముందుగా రవాణా చేయడానికి వీలుగా ప్రభుత్వం డిసెంబర్‌ 15 వరకు దిగుమతి నిబంధనలను సడలించింది.

ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశానికి భారీగా ఉల్లి దిగుమతి అయ్యేలా వ్యాపారులతో సంప్రదింపులు జరపాలని సంబంధిత దేశాల్లోని భారత హై కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలు నేరుగా భారతీయ ఓడరేవులకు చేరతాయని మంత్రిత్వశాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments