Webdunia - Bharat's app for daily news and videos

Install App

దత్తత తీసుకున్న పాపానికి.. ప్రేమికుడితో కలిసి ద్రోహం చేసింది..

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (16:59 IST)
దత్తత తీసుకున్న ఇంటికే తన ప్రేమికుడితో కలిసి ఎసరు పెట్టింది.. ఓ యువతి. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కన్యాకుమారి సమీపంలో మూవాట్టుకోణం అనే ప్రాంతానికి చెందిన జయకుమారి.. తన భర్తను కోల్పోయింది. ఆమె ఒంటరిగా జీవిస్తోంది. జయకుమారి దంపతులకు సంతానం లేకపోవడంతో.. తనకు తోడు కావాలని శ్రీన (19) అనే యువతిని దత్తత తీసుకుంది. 
 
శ్రీనయ ఓ కాలేజీలో చదువుకుంటోంది. ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకుని తిరిగివస్తానని చెప్పిన శ్రీనయ ఇంటికి చేరుకోలేదు. ఇంకా ఆమె సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యింది. అంతేగాకుండా.. ఇంట్లోని కోట్లాది విలువ చేసే పత్రాలు, బ్యాంక్ లాకర్ తాళాలు, సీక్రెట్ నెంబర్లు, పలు లక్షల విలువ గల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి.
 
దీన్ని గమనించిన జయకుమారి షాకైంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఈ విచారణలో శ్రీనయ షాలూ (23) అనే యువకుడిని ప్రేమిస్తోందని.. అతడితో కలిసి తిరుగుతుందని తెలుసుకున్నారు. జయకుమారికి చెందిన నగలను బ్యాంకు లాకర్ నుంచి తీసుకుని మోసానికి పాల్పడిన శ్రీనయపై బ్యాంకు అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనయ, షాలూలను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కన్యాకుమారి ప్రాంతంలో పెను సంచలనానికి దారితీసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments