Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ప్రాణాలతో రాగలిగాను.. మీ సీఎంకు థ్యాంక్స్ : ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (20:10 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం చేపట్టిన పంజాబ్ రాష్ట్ర పర్యటన అర్థాంతరంగా నిలిచిపోయింది. భద్రతా వైఫల్యంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రధాని మోడీ పంజాబ్ రాష్ట్ర పర్యటనకు వెళ్లకుండానే వెనక్కి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ రాష్ట్ర పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఇది కలకలం రేపుతోంది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌పై దాదాపు 20 నిమిషాల పాటు ఆగిపోయింది. నిరసనకారులు ఆయన ప్రయాణిస్తున్న రోడ్డు మార్గాన్ని నిర్బంధించడంతో మోడీ ఫ్లైఓవర్‌పైనే ఆగిపోయారు. 
 
ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఇది అతిపెద్ద భద్రతా లోపమని కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
ఆ తర్వాత ప్రధాని మోడీ ఆ ఫ్లైఓవర్ నుంచి భతిండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సంర్భంగా ఆయన ఎయిర్‌పోర్టు అధికారులతో మాట్లాడుతూ, "భతిండా ఎయిర్‌పోర్టు వరకు నేను ప్రాణాలతో రాగలిగాను. మీ సీఎంకు థ్యాంక్స్" అని అన్నారు. మరోవైపు, ఈ ఘటన వల్ల ఫిరోజ్‌పూర్‌లో ఆయన చేపట్టాల్సిన ర్యాలీ రద్దు అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments