Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొమినోస్ పిజ్జా ఉద్యోగి మృతి.. కారణం ఏంటంటే?

సెల్వి
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (10:00 IST)
థానే నగరంలో విషాధ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఉద్యోగి ప్రముఖ పిజ్జా చైన్ అవుట్‌లెట్‌లో శుభ్రపరిచే పనులు చేస్తున్నప్పుడు విద్యుదాఘాతం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు మహేశ్ అనంత్ కదమ్‌గా గుర్తించారు.
 
వర్తక్ నగర్ ప్రాంతంలోని డొమినోస్ పిజ్జా జాయింట్‌లో ఈ సంఘటన జరిగిందని థానే మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి ధృవీకరించారు.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు, ఉద్యోగులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 
 
పోలీసులు ఏడీఆర్ కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ షాక్‌కు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అదేవిధంగా, ఇటీవల సూరత్‌లోని దిండోలి ప్రాంతంలో ఇద్దరు టీనేజ్ సోదరులు విద్యుదాఘాతానికి గురైన సంఘటన జరిగింది. శివం యాదవ్ (13), శివ యాదవ్ (15) జనవరి 16న తమ పాఠశాల టెర్రస్‌ను శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments