Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజస్థాన్‌లో దారుణం.. విద్యుదాఘాతానికి నలుగురి దుర్మణం

Advertiesment
deadbody
, శుక్రవారం, 10 నవంబరు 2023 (10:45 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. విద్యుదాఘాతానికి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదాకర ఘటన వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని సలాంబర్ జిల్లాలోని లసాదియా ప్రాంతంలో గురువారం రాత్రి విద్యుత్ షాక్‌కో ఒక కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హాటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ, బోడ్ ఫల్లాలో నివాసం ఉండే ఉంకర్ మీనా ఇంటి సమీపంలోని విద్యుత్ స్తంభంలో షార్ట్ సర్క్యూట్ సంభవించిందని, అది ఇంటి ఇనుపగేటును తాకిందన్నారు. ఈ కారణంగా 68 యేళ్ళ  ఉంకర్ మీనా, అతని భార్య భన్వారీ (65)కూడా విద్యుదాఘాతానికి గురయ్యారని, తల్లిదండ్రులను రక్షించేందుకు ప్రయత్నించిన అతని 25 యేళ్ల కుమారుడు దేవీలాల్, అతని 22 యేళ్ళ కుమార్తె  కూడా ఎలక్ట్రిక్ షాక్‌కు గురికావడంతో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ఘటనపై పొరుగింటివారు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోర్టుమార్టం నిర్వహించి ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమ కుమార్తెను వేరే కులపోడు ప్రేమించాడనీ... అత్యంత కిరాతకంగా చంపేశారు.. ఎక్కడ?