Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో వీడియో గేమ్స్.. పేటీఎం ద్వారా రూ.35వేలు గుంజేసిన బుడతడు

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (19:06 IST)
స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా చిన్నారులను అడ్డదారిన నడిపిస్తున్నాయనేందుకు ఈ ఘటనే ఉదాహరణ. ఆన్‌లైన్‌లో వీడియో గేమ్స్ ఆడుతున్న ఓ ఎనిమిదేళ్ల బుడతడు తండ్రి డబ్బు రూ.35వేలను పేటీఎం నుంచి మాయం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ తండ్రి షాకయ్యాడు. ఈ ఘటన యూపీలోని లక్నోలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉన్నపళంగా బ్యాంక్ అకౌంట్ నుంచి 35 వేల రూపాయలు మాయం కావడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారించగా, బాధితుడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ పేరిట పేటీయం అకౌంట్ ఉందని తేలింది. పేటీయం వాలెట్లోకి అకౌంట్ నుంచి డబ్బును ట్రాన్స్ ఫర్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
అయితే బాధితుడు తన పేరిట అసలు పేటీయం అకౌంట్ లేదని పోలీసులకు తెలిపాడు. దీంతో డబ్బు ఎవరు మాయం చేసి ఉంటారని కుటుంబ సభ్యులను ఆరా తీయగా, బాధితుడి కుమారుడే డబ్బును పేటీయం నుంచి మాయం చేస్తున్నాడని విచారణలో తేలింది. తండ్రి పేరిట పేటీయం అకౌంట్ సృష్టించి దాన్ని బ్యాంక్ అకౌంట్ తో జత చేసి డబ్బులు గుంజుతున్నట్లు గమనించారు. 
 
అంతేకాదు ఆ డబ్బుతో ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఆడుతున్నట్లు గుర్తించారు. నిందితుడు నాలుగో తరగతి చదువుతుండటంతో అతనిని కౌన్సిలింగ్ ఇవ్వడంతో పోలీసులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments