Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకున్న కొత్త జంట భద్రత కల్పించమని వెళితే..ఫైన్ వేసారు..ఎంతో తెలుసా?

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (17:42 IST)
సాధారణంగా పెళ్లి చేసుకున్న కొత్త జంట ముందుగా గుడికి లేదా మరొక ప్రాంతానికి వెళ్తారు. కానీ ఒక కొత్త జంట మాత్రం పెళ్లయిన వెంటనే కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్లగానే రూ. 10,000 ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఈ విచిత్ర సంఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలేమిటో ఓసారి చూద్దాం.
 
ఇంట్లో వారికి తెలియకుండా ప్రేమించుకున్న ఓ జంట వివాహం చేసుకున్నారు. పెద్దలను కాదని పెళ్లి చేసుకోవడంతో వారు దాడి చేస్తారనే భయంతో కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కొత్త జంట తాము పెళ్లాడిన ఫోటోలను కోర్టు వారికి సమర్పించారు. ఆ ఫోటోలను పరిశీలించిన కోర్టు, వారికి రూ. 10,000 ఫైన్ విధించింది. ఫైన్ ఎందుకు వేసారో తెలిస్తే మీరు ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు.
 
కొత్త జంట పెళ్లి చేసుకునే సమయంలో ఎలాంటి మాస్క్‌లను ధరించలేదు. మాస్క్ లేకుండా బయటకు రాకూడదని ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాయి. ఒకవేళ మాస్క్ ధరించకుండా అలాగే బయటకు వస్తే భారీగా ఫైన్ విధిస్తామని కూడా ప్రకటించాయి. ఈ కొత్త జంట పెళ్లి సందట్లో పడిపోయి మాస్క్ ధరించడం మరచిపోయారు. అందుకు ఆ జంటకు రూ. 10,000 ఫైన్ వేసారు. ఈ ఫైన్‌ను 15 రోజులలోపు చెల్లించాలని, అలాగే డిపాజిట్ చేసిన డబ్బును మాస్క్‌ల తయారీ కోసం వినియోగించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments