Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం.. బాలికను వేధించి.. శానిటైజర్ తాగించారు..

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (08:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు కిరాతకులు ఓ బాలికను నానా రకాలుగా వేధించారు. ఆ తర్వాత శానిటైజర్ తాగించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ భయానక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, బరేలీకి చెందిన 16 యేళ్ళ విద్యార్థిని గత నెల 27వ తేదీన స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో మఠ్ లక్ష్మీపూర్ ప్రాంతానికి చెందిన ఉదేశ్ రాథోడ్ (21) అనే పోకిరి వేధించాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులు అతడికి తోడయ్యారు. నలుగురూ కలిసి బాలికను వేధించడం మొదలుపెట్టారు. 
 
అదేసమయంలో అటువైపుగా వస్తున్న బాలిక సోదరుడు చూసి అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతడిపై దాడి చేశారు. ఆ తర్వాత బాలికతో బలవంతంగా శానిటైజర్ తాగించాడు. ఈ మొత్తం ఘటనను వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ బాలిక శానిటైజర్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments