Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం సేవించిన వ్యక్తిని చెప్పుతో కొట్టిన పోలీస్ కానిస్టేబుల్.. ఎక్కడ?

police constable shoe
, సోమవారం, 24 జులై 2023 (11:43 IST)
పీకల వరకు మద్యం సేవించిన ఓ వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్ ఒకరు చెప్పుతోకొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హార్దోయ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దినేశ్ ఆత్రీ అనే కానిస్టేబులో శనివారం సాధారణ దుస్తుల్లో మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి పీకల వరకు మద్యం సేవించి మార్కెట్‌కు వచ్చిన మహిళలతో పాటు ఇతరులను ఇబ్బందులు పెట్టడాన్ని చూశాడు. పైగా, ఉచితంగా శీతలపానీయం ఇవ్వాలంటూ వ్యాపారులను విసిగించాడు. దీంతో పోలీస్ కానిస్టేబుల్ ఆత్రీ అతన్ని నివారించేందుకు ప్రయత్నించగా, వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో కానిస్టేబుల్ పట్ల ఆ తాగుబోతు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నోటికి పని చెప్పాడు. 
 
దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్.. తన కుడికాలి బూటను తీసుకుని పదేపదే కొట్టాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్త వైరల్ అయింది. ఈ వీడియో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్పీ దుర్గేశ్ కుమార్ స్పందించారు. ఈ ఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని, ఇందులో దాడికి పాల్పడిన కానిస్టేబుల్ ఆత్రీని తక్షణం సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో జిమ్ పైకప్పు కూలి 11 మంది మృత్యువాత