Webdunia - Bharat's app for daily news and videos

Install App

తౌక్టే తుపాను: 273మందితో కొట్టుకుపోయిన నౌక

Webdunia
సోమవారం, 17 మే 2021 (19:53 IST)
ముంబయి: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపాను దాటికి మహారాష్ట్ర సహా పలు తీర ప్రాంతాలు వణుకుతున్నాయి. పశ్చిమ వాయువ్యం దిశగా గంటకు 20 కి.మీల వేగంతో ‘తౌక్టే’ పయనిస్తోంది.

ఈ రాత్రికి గుజరాత్‌లోని పోరుబందర్‌- మహువా మధ్య తీరం దాటనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో తీర ప్రాంతాలను ఈ తుపాను హడలెత్తిస్తోంది.
 
ఈ రాత్రికి తౌక్టే తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ముంబయి నగరానికి ఆరెంజ్‌ హెచ్చరిక జారీచేసింది. ఐసోలేటెడ్‌ ప్రాంతాల్లో బలమైన గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ తుపాను వల్ల వీస్తున్న భీకరగాలులతో ముంబయికి పశ్చిమ తీరాన బాంబే హైవేలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయింది.

ఈ నౌకలో 273 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న నౌకాదళం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఐఎన్‌ఎస్‌ కొచ్చి యుద్ధ నౌక సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments