Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

ఠాగూర్
శనివారం, 30 నవంబరు 2024 (09:30 IST)
ఓ రైల్వే లైను నిర్మాణానికి బ్రిటీష్ పాలకుల హయాంలో చేపట్టిన సర్వే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు నిండిన తర్వాత పూర్తి చేసుకోవడం గమనార్హం. ఈ మాటలు వింటుంటే కాస్త విచిత్రంగా ఉందనుకోవద్దు. అక్షరాలా సత్యం 170 కిలోమీటర్ల పొడవుండే తనక్‌పూర్ - భాగేశ్వర్ రైల్వే లైను సర్వే పనులు ఎట్టకేలకు పూర్తిచేశారు. ఈ రైలు మార్గాన్ని నిర్మించేందుకు రూ.49 వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తయితే భారతీయ రైల్వేలు చైనా, నేపాల్ సరిహద్దుకు చేరువ అవుతాయి. 
 
తనక్‌పూర్.. నేపాల్, చైనా సరిహద్దు ప్రాంతం. తనక్‌పూర్ - భాగేశ్వర్ రైలు మార్గం దశాబ్దాల కల. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో 1882లో తొలిసారిగా రైలు మార్గాన్ని నిర్మించే పనిని ప్రారంభించింది. రైల్వే లైన్ కోసం మొదటి సర్వే 1912లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏడు సర్వేలు జరిగాయి. చివరిగా రెండేళ్లపాటు సాగిన తుది సర్వే నివేదికను ఇంజనీరింగ్ డిజైనింగ్ ద్వారా రైల్వే శాఖకు అందజేసింది.
 
తుది సర్వే ప్రకారం .. తనక్‌పూర్ - భాగేశ్వర్ మధ్య రైలు మార్గంలో 12 రైల్వే స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. 170 కిలోమీటర్ల రైల్వే లైన్ మధ్యలో ఈ రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. రైల్వే లైన్ కోసం 452 హెక్టార్ల భూమిని కూడా సేకరించాల్సి ఉంది. ఇందులో 27 హెక్టార్లు ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమి ఉంది. 
 
తనక్‌పూర్ - భాగేశ్వర్ రైలు మార్గాన్ని 2012లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టుగా పరిగణించింది. అప్పట్లో ఈ రైల్వే లైనులో 54 కిలోమీటర్ల మేర 72 సొరంగాలను ప్రతిపాదించారు. కాళీ నది ఒడ్డున తనక్‌పూర్ నుంచి పంచేశ్వర్ వరకూ ఈ రైలు మార్గాన్ని నిర్మించాలి. పంచేశ్వర్ దాటి సరయూ నది ఒడ్డున వెళుతుంది. ఈ రైల్వే లైన్ నిర్మాణం ద్వారా అల్మోరా, పితోర్ఢ్, చంపావత్, భాగేశ్వర్ జిల్లాలు నేరుగా ప్రయోజనం పొందుతాయి. అలాగే పర్వతానికి వెళ్లే మార్గం సులభతరం అవుతుంది. రైల్వే శాఖ తుది సర్వే పూర్తి అయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments