Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత - అవ్వల వద్ద ఉంటున్న బాలికపై అత్యాచారం... మృతశిశువును జన్మించి మృతి

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (11:03 IST)
తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట జిల్లాలోని ఊతంక్కరై పుదూర్ సమీపంలో 17 యేళ్ళ బాలికపై 27 యేళ్ళ యువకుడు పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారు. చివరకు ఆ బాలిక మృతశిశువుకు జన్మనిచ్చి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఊతంక్కరై పుదూర్ గ్రామానికి చెందిన 17 యేళ్ళ బాలిక స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటూ తాత - అవ్వల వద్ద నివశిస్తోంది. ఈ  బాలికపై అదే గ్రామానికి చెందిన 27 యేళ్ల యువకుడు ఒకడు కన్నేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. 
 
ఆ తర్వాత బాలికపై పదేపదే అత్యాచారం చేయసాగాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయాన్ని తాత అవ్వలకు తెలియకుండా ఆ బాలిక దాచిపెట్టింది. అయితే, ఆమె ఆరోగ్యం క్షీణించసాగడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు... బాలిక గర్భంతో ఉన్నట్టు తేల్చారు. ఆ తర్వాత ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ బాలిక మృతశిశువుకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచింది. దీంతో మృతురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తమిళరసన్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం