Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

ఠాగూర్
బుధవారం, 16 జులై 2025 (11:07 IST)
ఓ మహిళ డబ్బు కోసం పెళ్లిళ్లను వ్యాపారంగా చేసుకుంది. నగలు, నగదు కోసం ఏకంగా 11 మందిని వివాహం చేసుకుంది. వీరిలో చివరి పెళ్లి కుమారుడు కట్టుకున్న భార్య చేసిన మోసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ జిల్లాలో ఇది జరిగింది. పోలీసుల కథనం మేరకు...
 
నామక్కల్ జిల్లాకు చెందిన శివషణ్ముగం (37). భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా తన తల్లితో కలిసి ఉంటున్నాడు. రెండో వివాహం కోసం పెళ్లిళ్ల బ్రోకర్లు తమిళ్ సెల్వి (45), కస్తూరి (38), ముత్తులక్ష్మి, (45), వేల్ మురుగన్ (55), నారాయణన్ (56)లను సంప్ర దించగా, వారంతా కలిసి మదు రైకు చెందిన జ్యోతి అలియాస్ జ్యోతిలక్ష్మి (23)ని దీప అనే వధువుగా చూపించారు. 
 
ఈ పెళ్లి కుదిర్చితే రూ.4 లక్షలు కమిషన్ ఇచ్చేలా శివషణ్ముగంతో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ రూపేణా రూ.1.20 లక్షలు పుచ్చుకున్నారు. ఈ నెల 7న ఓ ఆలయంలో వివాహం జరిపించారు. తర్వాత భార్యను తీసుకుని శివషణ్ముగం తన ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు దీప నగలు, నగదు, వెండి వస్తువులతో ఉడాయించింది. 
 
దీంతో ఖంగుతిన్న వరుడు.. దీప, మధ్యవర్తులకు ఫోన్ చేయగా, వారి మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేసి ఉండటంతో తాను మోసపోయానని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రూ.30 వేల నగదు. కోసం దీప ఈ పెళ్లికి అంగీకరించినట్లు తేలింది. దీపతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగురు బ్రోకర్లను పోలీ సులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments