Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లితో సంబంధం.. ఆపై కుమార్తెపై కన్ను... పెళ్లి చేయాలంటూ ఖాకీ ఒత్తిడి

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (12:25 IST)
ఇటీవలికాలంలో సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కామాంధులుగా మారిపోతున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో శారీరకంగా కలుస్తూనే పెళ్లీడుకొచ్చిన ఆమె కుమార్తెపై కన్నేశాడు. అంతేనా.. ఆ యువతిని తనకిచ్చి పెళ్లి చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అతని వేధింపులు భరించలేని ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వేలూరు జిల్లా వాలాజా సమీపంలోని మేల్‌పుదుపేటకు చెందిన మహిళ (36) భర్తతో విభేధాలతో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈమెకు కావేరిపాక్కంకు చెందిన పోలీస్ కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడి.. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
అదేసమయంలో ఆమె ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తెపై ఆ కానిస్టేబుల్ కన్నేశాడు. ఆమెను తనకిచ్చి వివాహం చేయాలని ఒత్తిడి చేశాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన ఆమె అతడిని ఇంటికి రావద్దంటూ హెచ్చరించింది. 
 
అయినా అతని వేధింపులు ఆగక పోవడంతో ఆ మహిళ బుధవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వాలాజా పోలీసులు సంఘటనా స్థలానికి చేరు కుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments