Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడియో కాల్ ద్వారా మహిళకు ప్రసవం.. శిశువు మృతి

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (20:06 IST)
వీడియో కాల్ ద్వారా మహిళకు ప్రసవం చేశాడు ఓ వైద్యుడు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ శిశువు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గర్భంతో ఉన్న పుష్ప (33) సునంబేడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ ఆస్పత్రికే రెగ్యులర్ చెకప్​లకు వెళ్తోంది. 
 
సోమవారం (సెప్టెంబర్ 19న) బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. ఇందుకోసం భర్త మురళితో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. మహిళను పరీక్షించిన వైద్యుడు.. పురుటి నొప్పులు వచ్చినప్పుడు ఆస్పత్రికి రావాలని చెప్పాడు. 
 
ప్రస్తుతానికి ఇంటికి వెళ్లిపోవాలని సూచించాడు. అయితే, అదే రోజు మధ్యాహ్నం పుష్పకు నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అక్కడ నర్సులు తప్ప వైద్యుడు లేడు.
 
అంతకుముందు నిర్వహించిన పరీక్షల్లో పుష్పకు సమస్యలు ఉన్నట్లు తేలింది. అయితే, అవేవీ తెలుసుకోకుండా నర్సులు.. నార్మల్ డెలివరీకి ప్రయత్నించారు. అప్పుడే వీరికి అసలు సమస్య ఎదురైంది. 
 
డెలివరీ చేస్తుండగా సాయంత్రం ఆరు గంటల సమయంలో శిశువు కాళ్లు బయటకు రావడాన్ని గమనించారు. దీంతో గర్భంలో శిశువు అడ్డం తిరిగినట్లు నిర్ధరణకు వచ్చారు. వెంటనే వైద్యుడిని సంప్రదించారు.
 
డాక్టర్.. వీడియో కాల్ ద్వారా నర్సులకు సూచనలు చేశాడు. నర్సులు అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ శిశువు తల బయటకు రాలేదు. ఇక చేసేదేం లేక, పుష్పను మదురంతగమ్ జీహెచ్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. 
 
పుష్పను అంబులెన్సులో ఎక్కించారు. అయితే, మదురంతగమ్ ఆస్పత్రికి చేరుకునే ముందే శిశువు తల బయటకు వచ్చింది. కానీ, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బయటకు వచ్చింది మృతశిశువు అని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments