Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమను అంగీకరించని టీచర్.. క్లాస్ రూమ్‌లో కత్తితో పొడిచిన యువకుడు

సెల్వి
బుధవారం, 20 నవంబరు 2024 (15:28 IST)
తమిళనాడు, తంజావూరులో తన ప్రేమను అంగీకరించని కారణంగా మహిళా టీచర్‌ను కత్తితో పొడిచి చంపేశాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళితే.. తంజావూరు, మల్లిపట్నం ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్తున్న టీచర్ రమణిని కత్తితో పొడిచి హత్య చేసాడు. 
 
తన ప్రేమను టీచర్ అంగీకరించకపోవడంతో స్టూడెంట్ మదన్ కుమార్ హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో వున్న మదన్‌ను పోలీసులు గాలిస్తున్నారు.
 
రెండ్రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన మధన్, అతని కుటుంబ సభ్యులు ఇద్దరికీ పెళ్లి చేయాలని కోరుతూ రమణి ఇంటికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారి పెళ్లి ప్రతిపాదనను రమణి తిరస్కరించడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది.
 
మధన్ ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. కాని రమణి అతనిని వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు రమణిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయురాలి దారుణ హత్య తర్వాత తంజావూరు జిల్లా యంత్రాంగం పాఠశాలకు ఒక రోజు సెలవు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments