Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మియాపూర్‌ లాడ్జిలో శవమై కనిపించిన టీచర్.. ఏం జరిగింది?

మియాపూర్‌ లాడ్జిలో శవమై కనిపించిన టీచర్.. ఏం జరిగింది?

సెల్వి

, బుధవారం, 29 మే 2024 (15:39 IST)
హైదరాబాద్ మియాపూర్‌లోని ఓ లాడ్జిలో పాఠశాల ఉపాధ్యాయుడు శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జై ప్రకాష్ తుల్లే (30) రెండు రోజుల క్రితం తన స్వగ్రామం నుంచి కూకట్‌పల్లిలో తన సోదరిని కలిసేందుకు వచ్చాడు. 
 
శనివారం మధ్యాహ్నం తన సోదరి ఇంటి నుంచి బయలుదేరి మియాపూర్‌లోని లాడ్జిలోకి వచ్చాడు. ఆదివారం శవమై కనిపించాడు. అతడు విషం సేవించి బలవన్మరణానికి పాల్పడి వుంటాడని తెలుస్తోంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్‌లో దారుణం : ఫ్యామిలీ సభ్యుల హతం.. ఆపై ఆత్మహత్య