Webdunia - Bharat's app for daily news and videos

Install App

బురేవి బీభత్సం.. తమిళనాడులో ఏడుగురు మృతి.. పదిలక్షల ఎక్స్‌గ్రేషియా

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (21:37 IST)
బురేవి తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల ధాటికి తమిళనాడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బురేవి ధాటి తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. 
 
ఈ నేపథ్యంలో బురేవి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం పళనిస్వామి అధికారులను ఆదేశించారు. వరదల్లో మృతిచెందిన వారికి రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
 
రామేశ్వరంలోని తీర ప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలో తుఫాను పరిస్థితిపై సీఎం పళనిస్వామి సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు 11మంది మంత్రులను నియమించారు. 
 
ఈ తుఫాను ప్రభావంతో అత్యధికంగా కడలూరు జిల్లాలో వర్షాలు కురిశాయి. 2వేలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్లు దెబ్బతిన్నవారికి, మూగజీవాలు నష్టపోయిన రైతులకు సీఎం పరిహారం ప్రకటించారు. మరోవైపు, సహాయక చర్యల కోసం 14 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments