Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింత ఆచారం... కారం నీళ్ళతో పూజారికి అభిషేకం

ఠాగూర్
శనివారం, 26 జులై 2025 (08:00 IST)
ఆధునిక సమాజంలో మూఢ నమ్మకాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఇక్కడ ఉన్న అనేక కొండ ప్రాంత గ్రామాల్లో వింత ఆచారాలను ఆ ప్రాంత ప్రజలు పాటిస్తుంటారు. తాజాగా ఓ వింత ఆచారం ఒకటి వెలుగు చూసింది. ఒక ఆలయ పూజారికి కారం నీళ్లతో అభిషేకం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లాలో జరిగింది. స్థానికంగా ఉండే పెరియకరుప్పు ఆలయంలో ఈ వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. యేటా ఆడి అమావాస్య సందర్భంగా ఆలయ పూజారికి ఇలా కారం, పచ్చి మిరపకాయలు కలిపిన నీళ్లతో అభిషేకించడం జరుగుతుంది. 
 
ఇందులోభాగంగా, గురువారం ఆడి అమావాస్య రావడంతో 108 కిలోల కారం, ఆరు కిలోల పచ్చి మిరపకాయలు కలిపిన నీళ్ళతో పూజారి గోవింద్‌కు అభిషేకం చేశారు. ఈ ప్రత్యేక అభిషేకంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే భక్తులకు ఆలయ ప్రాంగణంలో మాంసాహార విందు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారమని స్థానిక భక్తులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments