Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళనిస్వామి మాకొద్దూ.. వారిచ్చే స్వీట్లూ వద్దు... సీఎం సొంత జిల్లాలో వింత

సాధారణంగా తమ జిల్లా నేత రాష్ట్రాధినేత (ముఖ్యమంత్రి) అయితే, ఆ జిల్లా వాసులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకోవడం జరుగుతుంది. కానీ, బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వా

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (08:51 IST)
సాధారణంగా తమ జిల్లా నేత రాష్ట్రాధినేత (ముఖ్యమంత్రి) అయితే, ఆ జిల్లా వాసులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకోవడం జరుగుతుంది. కానీ, బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామికి వింత పరిస్థితి ఎదురైంది. 
 
తమ నేత ముఖ్యమంత్రి అయ్యారన్న సంతోషంలో పళనిస్వామి అనుచరులు భారీ మొత్తంలో స్వీట్లు పంచారు. అయితే, వీటిని తీసుకునేందుకు ప్రజలు నిరాకరించారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్ళూరిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ... అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించడంతో జైలుకెళ్ళారు. దీంతో ఆమె తన ప్రధాన అనుచరుడు ఎడప్పాడి కె. పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. 
 
దీంతో ఆయనతో గవర్నర్‌ సీహెచ్ విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నేపథ్యంలో ఎడప్పాడి పళనిస్వామి శనివారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు, అన్నాడీఎంకే కార్యకర్తలు సేలంలో బాణాసంచా పేల్చుతూ స్వీట్లు పంపిణీ చేసేందుకు పూనుకున్నారు. 
 
కానీ, స్థానికులు మాత్రం పళనిస్వామి అనుచురులు ఇచ్చిన స్వీట్లు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో పళనిశ్వాని మద్దతుదారులు విస్తుపోయారు. తమ నేతపై ప్రజావ్యతిరేకత ఇంత స్థాయిలో ఉందా అంటూ వారు ఆశ్చర్యపోయారు. మున్ముందు కూడా ఇదే స్థాయిలో ఉంటే అన్నాడీఎంకే కనుమరుగు కావడం ఖాయమని వారు వాపోతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments