శశికళ దేశం కోసం పోరాడి జైలుకొచ్చారా: కర్నాటక డీజీపీ ప్రశ్న
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై కర్నాటక డీజీపీ సత్యనారాయణ రావ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉన్న శశికళ విషయంలో మీడియా మరీ ఎక్కువ ఉ
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై కర్నాటక డీజీపీ సత్యనారాయణ రావ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉన్న శశికళ విషయంలో మీడియా మరీ ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతోందని వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా.. శశికళ ఏమైనా దేశం కోసం పోరాడి జైలుకొచ్చారా? అని మీడియాను ప్రశ్నించారు. శశికళ విషయంలో మీడియా ఎందుకంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన నిలదీశారు.
అదేసమయంలో రాష్ట్రంలోని జైలుకొచ్చేవారంతా నేరస్థులేనని డేర్ కామెంట్స్ చేశారు. పరప్పణ అగ్రహార జైలులో ఏ, బీ అంటూ రెండు రకాల గదులు ఉండవని, జైల్లోని గదులన్నీ ఒకేలా ఉన్నాయని స్పష్టం చేశారు. మిగతా ఖైదీలంతా ఉన్నట్టుగానే శశికళ కూడా ఉన్నారని, అలానే ఆహారం కూడా అందజేస్తున్నట్టు చెప్పారు.