Webdunia - Bharat's app for daily news and videos

Install App

విచ్చలవిడిగా తాగారు.. ఊగారు.. ఆపై అద్దె ఎగ్గొట్టారు: రిసార్టులో శశికళ ఎమ్మెల్యేలు

తమిళనాడు అసెంబ్లీలో శశికళ వర్గం పళనిస్వామి బలపరీక్షలో నెగ్గి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుని ఉండవచ్చు కానీ దాదాపు పది రోజులపాటు మహాబలిపురంలోని గోల్డెన్ రిసార్టులో బసచేసిన ఎమ్మెల్యేల లీలలు ఒక్కటొక్కటిగా బయటపడుతుంటే తమిళనాడు ప్రజలు నివ్వెరపోతున్నారు.

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (07:29 IST)
తమిళనాడు అసెంబ్లీలో శశికళ వర్గం పళనిస్వామి బలపరీక్షలో నెగ్గి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుని ఉండవచ్చు కానీ దాదాపు పది రోజులపాటు మహాబలిపురంలోని గోల్డెన్ రిసార్టులో బసచేసిన ఎమ్మెల్యేల లీలలు ఒక్కటొక్కటిగా బయటపడుతుంటే తమిళనాడు ప్రజలు నివ్వెరపోతున్నారు. ఇష్టమొచ్చినట్లుగా తాగడం, తినడం, కిచెన్ సిబ్బందిని బెదిరించుకుని మరీ ఆహారపదార్ధాలు మెక్కటం.. శశికళ వర్గం క్యాంపు కాబట్టి ఇవన్నీ సహజమే అనుకోవచ్చు. కానీ సిగిరెట్టు ఇచ్చావు సరే.. అగ్గిపెట్టె ఎవడిత్తారు అని తెలుగు సినీ హీరో మహేష్ బాబు ఒక సినిమాలో డైలాగ్ చెప్పినట్లుగా రిసార్టులో పెట్టిన ఖర్చు విషయం వచ్చేసరికి ఎవరూ మాట్లాడకుండా బిల్లు చెల్లించకుండా ఎవరిదారిన వారు పోవండతో రిసార్ట్ యాజమాన్యం గుండెల్లో రాయి పడింది. పది రోజుల బిల్లు మొత్తం 60 లక్షలు కాగా  కేవలం 5 లక్షలు మాత్రమే చెల్లించి రిసార్టునుంచి బయటపడిన ఎమ్మెల్యేలలో ఎవరు తమ బల్లును చెల్లిస్తారని యాజమాన్యం జుత్తు పీక్కుంటోంది.
 
వివరాల్లోకి వెళితే..  ఈనెల 9వ తేదీన సాయంత్రం మూడు బస్సుల్లో ఈ రిసార్టుకు చేరుకున్న ఎమ్మెల్యేలు... 18వ తేదీ శనివారం ఉదయం 9 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఈ పది రోజులకు మొత్తం రూ.60 లక్షలు అయినట్టుగా రిసార్టు మేనేజ్‌మెంట్‌ బిల్లు ఇచ్చింది. కానీ, కేవలం రూ.5 లక్షల బిల్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.55 లక్షల అద్దెను రాబట్టుకో వడం ఎలాగో తెలియక రిసార్టు యాజమాన్యం ఆందోళన చెందుతోంది. అన్నాడీఎంకేలో ఏర్పడిన అధిపత్య పోరు కారణంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. దీంతో శశికళ వర్గానికి చెందిన 128 మంది ఎమ్మెల్యేలను మూడు బస్సుల్లో ఈ రిసార్టుకు తరలించారు. ఈనెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అక్కడే ఉన్నారు. తొలుత ఎమ్మెల్యేలు చేరు కోగా, సాయంత్రానికి ఎమ్మెల్యేల అనుచరులు రిసార్టుకు పెద్ద సంఖ్యలో వచ్చేశారు.
 
దీంతో ఎమ్మెల్యేలతో పాటు.. వెయ్యి మంది వరకు ఇక్కడ బస చేశారు. సాధారణంగా ప్రతి శని, ఆదివారాల్లో రద్దీగా ఉండే ఈ రిసార్టులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల బసతో పదిరోజుల పాటు కళకళ లాడింది. అదేసమయంలో ఈ రిసార్టుకు వచ్చే స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్య పూర్తిగా తగ్గి పోయింది. అంతేకాకుండా, ఈ రిసార్టులో ఉన్న కిచెన్, గదులు అతి తక్కువ మందికి మాత్రమే సరిపడ ఉన్నా యి. కానీ, వెయ్యిమంది బస చేయడంతో వారు కోరిన ఆహార పదార్థాలను తయారు చేసేందుకు రిసార్టులోని కిచెన్ 24 గంటల పాటు పని చేయాల్సి వచ్చింది. ఒక వేళ ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలు ఆలస్యమైతే రిసార్టు వెయిట ర్లను ఎమ్మెల్యేలు దుర్భాషలాడినట్టు యాజమాన్యం పేర్కొంటోంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తాము బస చేసిన గోల్డెన్ బే రిసార్టుకు అద్దెకు చెల్లించలేదు. ఈ అద్దె చెల్లించే వారికోసం యాజమాన్యం గాలిస్తోంది. 
 
అంతేకాకుండా, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా మద్యం సేవించారు. దీంతో పుదుచ్చేరి నుంచి మద్యాన్ని ఈ రిసార్టుకు తీసుకొచ్చినట్టు సమాచారం. కాగా, ఈ రిసార్టును 2011లో నిర్మించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కారణంగా ఈ రిసార్టు రేటింగ్‌ కూడా గూగుల్‌ సెర్చ్‌లో 4.2 నుంచి 1.2కు పడిపోయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments