Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంకే స్టాలిన్ పూర్వీకులు తెలుగువారా? తెరపైకి సరికొత్త చర్చ!

Webdunia
ఆదివారం, 9 మే 2021 (13:50 IST)
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించార. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే ఒంటరిగా 125 సీట్లలో విజయం సాధించింది. దీంతో మిత్రపక్షాల సహాయం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, స్టాలిన్ పూర్వీకులు తెలుగువారనే చర్చ ఇపుడు తెరపైకివచ్చింది. 
 
స్టాలిన్ పూర్వీకులను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. స్టాలిన్‌ తండ్రి కరుణానిధి తల్లిదండ్రులు ప్రకాశం జిల్లాకు చెందినవారేనట. కరుణానిధి మద్రాస్ ప్రెసిడెన్సీలో తిరువారూర్ జిల్లాలోని తిరుక్కువళైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తెలుగువారు. ఆయన మాతృభాష తెలుగు.
 
ముత్తువేలు, అంజు దంపతులకు 1924 జూన్ 3వ తేదీన జన్మించన కరుణానిధికి తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధి పూర్వీకులది నిజానికి విజయనగరం జిల్లా. జీవనోపాధి కోసం ఒంగోలు ప్రాంతానికి వలస వచ్చిన కరుణ పూర్వీకులు ఇక్కడ పెళ్లూరు సంస్థానాన్ని పరిపాలించిన వెంకటగిరి మహారాజా ఆస్థానంలో చేరారు
 
వాయిద్య కళాకారులుగా ప్రతిభ చూపిస్తూ వెంకటగిరి మహారాజు వద్ద పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఒంగోలు శివారు లోని పెళ్లూరు గ్రామంలో ఉన్న శివాలయంలో వీరు మంగళవాయిద్యాలు వాయించేవారు. అలా నాయిబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కరుణానిధి పూర్వీకులు ఐదు కుటుంబాలు ఇక్కడ స్థిరపడ్డారు. 
 
వీరి కుటుంబం నివసించడానికి చెరువుకొమ్ముపాలెం గ్రామంలో నివాస స్థలాలు కేటాయించారు మహరాజావారు అంతేగాక వీరికి దాదాపు 150 ఎకరాల భూమిని మాన్యంగా కేటాయించారు. ఆభూములను సాగుచేసుకుంటూ, దేవాస్థానం ఆస్థాన విద్వాంసులుగా కూడా చాలాకాలం పనిచేశారు.
 
అయితే, కరువు కాటకాలు రావడం, పంటలు పండకపోవడంతో జీవనం కష్టమైంది. దీంతో కరుణానిధి పూర్వీకులు ఇక్కడి భూములను విక్రయించి, తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి వలస వెళ్లినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విషయాలను కరుణానిధే స్వయంగా చెప్పినట్లు వారు గుర్తుచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments