Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను రేప్ చేసిన ఇంటర్ విద్యార్థి.. కరెంట్ షాకిచ్చి చంపేశాడు...

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (13:05 IST)
తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్ చదివే విద్యార్థి ఒకరు మృగంలా ప్రవర్తించాడు. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. తాను చేసిన పాడుపని బయటకు చెపుతుందన్న భయంతో ఆ చిన్నారికి కరెంట్ షాకిచ్చి చంపేశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దిండింగల్ జిల్లా కురుంపట్టికి చెందిన ఓ మైనర్ బాలిక ఏడో తరగతి చదువుతోంది. ఈమె ఇటీవల అనుమానాస్పదస్థితిలో మరణించింది. అయితే, శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నాయి. ముఖ్యంగా, కరెంట్ షాకిచ్చినట్టుగా గుర్తులు కనిపించాయి. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా, స్థానికంగా ఉండే ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. 
 
ఈ విచారణలో తానే ఈ దారుణానికి తెగబడినట్లు బాలుడు అంగీకరించాడు. ఈ నెల 16వ తేదీన బాలిక ఇంట్లో ఉండగా, తాను లైంగిక దాడికి పాల్పడ్డానని చెప్పాడు. ఆ సమయంలో బాలిక ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టి లొంగదీసుకున్నానని చెప్పాడు. చివరగా తనను పోలీసులకు పట్టిస్తుందన్న భయంతో ఆమె నోట్లో కరెంట్ వైర్లు పెట్టి షాక్ ఇచ్చి చంపేసినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ యువకుడు స్థానికంగా ఉండే ఓ స్కూల్‌లో ఇంటర్ చదువుతున్నాడు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం