Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను రేప్ చేసిన ఇంటర్ విద్యార్థి.. కరెంట్ షాకిచ్చి చంపేశాడు...

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (13:05 IST)
తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్ చదివే విద్యార్థి ఒకరు మృగంలా ప్రవర్తించాడు. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. తాను చేసిన పాడుపని బయటకు చెపుతుందన్న భయంతో ఆ చిన్నారికి కరెంట్ షాకిచ్చి చంపేశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దిండింగల్ జిల్లా కురుంపట్టికి చెందిన ఓ మైనర్ బాలిక ఏడో తరగతి చదువుతోంది. ఈమె ఇటీవల అనుమానాస్పదస్థితిలో మరణించింది. అయితే, శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నాయి. ముఖ్యంగా, కరెంట్ షాకిచ్చినట్టుగా గుర్తులు కనిపించాయి. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా, స్థానికంగా ఉండే ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. 
 
ఈ విచారణలో తానే ఈ దారుణానికి తెగబడినట్లు బాలుడు అంగీకరించాడు. ఈ నెల 16వ తేదీన బాలిక ఇంట్లో ఉండగా, తాను లైంగిక దాడికి పాల్పడ్డానని చెప్పాడు. ఆ సమయంలో బాలిక ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టి లొంగదీసుకున్నానని చెప్పాడు. చివరగా తనను పోలీసులకు పట్టిస్తుందన్న భయంతో ఆమె నోట్లో కరెంట్ వైర్లు పెట్టి షాక్ ఇచ్చి చంపేసినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ యువకుడు స్థానికంగా ఉండే ఓ స్కూల్‌లో ఇంటర్ చదువుతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం