Webdunia - Bharat's app for daily news and videos

Install App

శతాధిక దంపతులు ఒకే సారి కన్నుమూశారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (16:08 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఓ విషాదకర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. శతాధిక దంపతుల జోడి ఒకేసారి తనువు చాలించింది. మనుమలు, మనుమరాండ్లు, మునిమళ్లను కూడా చూసిన ఆ జంట... ఒకేసారి చనిపోవడంతో ఆ ఇంట్లోనే కాదు, ఆ గ్రామంలోనే విషాదఛాయలు అలముకున్నాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని కుప్పకూడి గ్రామానికి చెందిన వెట్రివేల్ (104), పిచాయి (100) అనే శతాధిక దంపతులు ఉన్నారు. వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరందరికీ వివాహాలు అయిపోయాయి. ఫలితంగా ఈ వృద్ధ జంటకు 23 మంది మనవళ్లు, మనుమరాండ్లు, మునిమనుమళ్ళు ఉన్నారు. వీరంతా ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో సోమవారం రాత్రి వెట్రివేల్‌కు ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఆ తర్వాత వెట్రివేల్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. భర్త శవం పక్కనే కూర్చున్న పిచాయి కన్నీరు పెడుతూ మూర్ఛపోయింది. 
 
దీంతో వైద్యులను పిలిపించి పరీక్షించగా, ఆమె కూడా ప్రాణాలు విడినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో 80 యేళ్ళ వైవాహిక బంధం ముగిసిపోయింది. ఈ శతాధిక వృద్ధులు చనిపోవడంతో ఆ ఇంట్లోనే కాదు గ్రామంలో కూడా విషాదఛాయలు అలముకున్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments