Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత యువకుడితో లేచిపోవాలనుకున్న కుమార్తె - కిరోసిన్ పోసి నిప్పంటించిన తల్లి

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (13:43 IST)
తమిళనాడు రాష్ట్రంలో మరో పరువు హత్య జరిగింది. అగ్రకులానికి చెందిన ఓ యువతి దళిత యువకుడుని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన పెద్దలు ప్రేమికులిద్దరినీ హెచ్చరించారు. అయినప్పటికీ ఆ యువతి మాత్రం అతనితో పారిపోవాలని ప్లాన్ చేసుకుంది. సమాచారం తెలుసుకున్న తల్లి కుమార్తె శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత వారు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగపట్టణం జిల్లా వాజ్‌మంగళం గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉమా మహేశ్వరి, కన్నన్‌ దంపతులకు జనని అనే 17 యేళ్ల కుమార్తె ఉంది. ఈమె ఇదే గ్రామానికి చెందిన ఓ దళిత యువకుడిపై మనసు పారేసుకుంది. 
 
ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆ ప్రేమికులను హెచ్చరించారు. అంతేకాకుండా, తమ కుమార్తెకు 18 యేళ్లు నిండిన తర్వాత పెళ్లి చేయాలని ఉమామహేశ్వరి దంపతులు నిర్ణయించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న జనని ప్రేమించిన యువకుడితో లేచిపోయేందుకు నిర్ణయించుకుంది. ఇరుగుపొరుగువారి ద్వారా సమాచారం తెలుసుకున్న ఉమామహేశ్వరి ఆగ్రహంతో ఊగిపోయింది. కన్నబిడ్డ అని కూడా చూడకుండా జననిపై కిరోసిన్‌ పోసి సజీవ దహనం చేసింది. 
 
ఆ తర్వాత తనపై కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో జనని ప్రాణాలు కోల్పోగా, మహేశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments