Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఘోరం.. ఆరు వాహనాలు ఢీ - ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (10:51 IST)
తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం ఉదయం ఘోరం జరిగింది. ఒకే సమయంలో ఆరు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో రెండు ప్రైవేటు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఉన్నాయి. 
 
మంగళవారం ఉదయం కడలూరు జిల్లా వెప్పూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. చనిపోయినవారంతా కార్లలో ప్రయాణిస్తున్న వారే. దీనిపై సమాచారం అందుకున్న కడలూరు జిల్లా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని సమీపంలోని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 
 
క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే, మృతుల వివరాలు తెలియాల్సివుంది. పోలీసుల ప్రాథకమి సమాచారం మేరకు.. మృతులంతా చెన్నైకు చెందినవారిగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments