హిజాబ్ ధరించి వచ్చి ఓటేసేందుకు వచ్చిన మహిళను అడ్డుకున్న బీజేపీ ఏజెంట్

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (17:57 IST)
తమిళనాడు రాష్ట్రంలో నగర, పురపాలక, పట్టణ పంచాయతీలకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అంతా ప్రశాంతంగా సాగుతుందని భావించిన తరుణంలో మదురైలో హిజాబ్ వివాదం చెలరేగింది. పోలింగ్ కేంద్రానికి హిజాబ్ ధరించి వచ్చిన ఓ ముస్లిం మహిళను ఓటు వేయకుండా బీజేపీ అభ్యర్థి తరపు ఏజెంట్ అడ్డుకున్నారు. దీంతో పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. 
 
హిజాబ్ తొలగించిన తర్వాత తర్వాతే ఆ మహిళ ఓటు వేయాలని, అపుడే ఓటు వేయడానికి అనుమతించాలంటూ బీజేపీ ఏజెంట్ పోలింగ్‌ బూత్‌లో వీరంగం సృష్టించాడు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత డీఎంకే, అన్నాడీఎంకే సహా ఇతర పోలింగ్ ఏజెంట్లు సదరు బీజేపీ ఏజెంట్‌ను పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపించాలంటూ డిమాండ్ చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని బీజేపీ ఏజెంట్‌ను బయటకు పంపించారు. ఆ తర్వాత ఆ మహిళ ఓటు హక్కును వినియోగించుకుంది. కాగా, కర్నాటక రాష్ట్రంలో తలెత్తిన హిజాబ్ వివాదం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాకింది. ఇపుడు తమిళనాడు ఎన్నికల్లో ఈ వివాదం తలెత్తింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments