Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ ధరించి వచ్చి ఓటేసేందుకు వచ్చిన మహిళను అడ్డుకున్న బీజేపీ ఏజెంట్

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (17:57 IST)
తమిళనాడు రాష్ట్రంలో నగర, పురపాలక, పట్టణ పంచాయతీలకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అంతా ప్రశాంతంగా సాగుతుందని భావించిన తరుణంలో మదురైలో హిజాబ్ వివాదం చెలరేగింది. పోలింగ్ కేంద్రానికి హిజాబ్ ధరించి వచ్చిన ఓ ముస్లిం మహిళను ఓటు వేయకుండా బీజేపీ అభ్యర్థి తరపు ఏజెంట్ అడ్డుకున్నారు. దీంతో పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. 
 
హిజాబ్ తొలగించిన తర్వాత తర్వాతే ఆ మహిళ ఓటు వేయాలని, అపుడే ఓటు వేయడానికి అనుమతించాలంటూ బీజేపీ ఏజెంట్ పోలింగ్‌ బూత్‌లో వీరంగం సృష్టించాడు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత డీఎంకే, అన్నాడీఎంకే సహా ఇతర పోలింగ్ ఏజెంట్లు సదరు బీజేపీ ఏజెంట్‌ను పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపించాలంటూ డిమాండ్ చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని బీజేపీ ఏజెంట్‌ను బయటకు పంపించారు. ఆ తర్వాత ఆ మహిళ ఓటు హక్కును వినియోగించుకుంది. కాగా, కర్నాటక రాష్ట్రంలో తలెత్తిన హిజాబ్ వివాదం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాకింది. ఇపుడు తమిళనాడు ఎన్నికల్లో ఈ వివాదం తలెత్తింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments