Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో జూన్ 7 వరకు లాక్ డౌన్... సీఎం స్టాలిన్ ప్రకటన

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (21:52 IST)
తమిళనాడులో జూన్ 7 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్ డౌన్ ముగుస్తుండగా.. కరోనా కేసులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం తమిళనాడులో సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతుండగా.. నిత్యావసర సరుకులు, కూరగాయలను ప్రభుత్వ శాఖల ద్వారా మాత్రమే ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఈ డెలివరీ కొనసాగుతోంది. 
 
స్థానిక సంస్థల అనుమతితో ఆయా ప్రాంతాల్లో వాహనాల ద్వారా అవసరమైన సామాగ్రిని విక్రయించడానికి ప్రొవిజన్ స్టోర్లను అనుమతిస్తామని స్టాలిన్ ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు 13 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన కిట్‌ను అందచేస్తామన్నారు. లాక్‌డౌన్ లో కోవిడ్-19 కేసులు తగ్గిన పూర్తి సంతృప్తికరమైన ఫలితాలు రాలేదని స్టాలిన్ చెప్పారు. 
 
ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ కు ఎలాంటి సడలింపులుండవని ప్రభుత్వం తెలిపింది. జూన్ ఏడు వరకూ ఇవే నిబంధనలు కొనసాగుతాయని సిఎం స్టాలిన్ వెల్లడించారు. అటు తమిళనాడులో తాజాగా 33,361 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 474 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments