Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సప్లై ఆపేయండి.. పళనిసామి

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (09:41 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు సప్లై చేస్తున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాను ఆపివేయాలని, తమిళనాడులో రోజు రోజుకు కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో తయారయ్యే ఆక్సిజన్‌ను రాష్ట్రంలోనే వినియోగించుకునే అవకాశం కల్పించాలని తెలిపారు.
 
ప్రస్తుతం తమిళనాడుకు రోజు 310 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని, రాబోయే రోజుల్లో మరింత అవసరమయ్యే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని 80 మెట్రిక్ టన్నులను తెలుగు రాష్ట్రాలకు ఎగుమతి కాకుండా నిలిపివేయాలని పళనిస్వామి ప్రధానికి లేఖ రాశారు. 
 
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో 310 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఖర్చు అవుతోందని, కానీ కేంద్రం కేవలం 220 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే కేటాయించిందని శ్రీ పెరంబదూర్ నుంచి సప్లై అవుతున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తమిళనాడుకు కేటాయించాలని పళనిస్వామి లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments