Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఎదురెదురుగా ఢీకొన్న ప్రైవేటు బస్సులు - ఐదుగురి మృతి

bus accident
Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (15:09 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో రెండు ప్రైవేటు బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో 80 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద సోమవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కడలూరు నుంచి వేగంగా వెళ్తున్న ప్రైవేటు బస్సు ముందు టైరు పేలి పోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పిపోయింది. అదేసమయంలో బన్రుట్టి నుంచి కడలూరు వైపు వస్తున్న మరో ప్రైవేటు బస్సును బలంగా ఢీకొట్టింది. 
 
ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను బయటకి తీశారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments