Webdunia - Bharat's app for daily news and videos

Install App

మటన్ బిర్యానీని ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఏది? పార్శిల్స్‌లో కూడా...

Webdunia
సోమవారం, 27 జనవరి 2020 (09:50 IST)
సాధారణంగా ఆలయానికి వెళ్లాలంటే ఎంతో నిష్టతో వెళతారు. శుభ్రంగా స్నానం చేసి, ఉతికిన వస్త్రాలు ధరించి, ఎలాంటి మాంసాహారం తినకుండా భక్తిశ్రద్ధలతో వెళతారు. అయితే, దేశంలో ఏ ఆలయంలోని లేని వింత ఆచారం తమిళనాడులోని ఓ ఆలయంలో ఉంది. ఆ ఆలయానికి వచ్చే భక్తులకు చికెన్, మటన్ బిర్యానీని ప్రసాదంగా అందజేస్తారు. ఇలాంటి ఆలయంలో తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలోని వడకంపట్టి అనే గ్రామంలోవుంది. ఆ ఆలయం పేరు మునియాండి స్వామి ఆలయం. 
 
ఈ ఆలయానికి దేశంలో ఎక్కడా లేని లేని వింత ఆచారంతో పాటు విశిష్టత కూడా ఉంది. నిజానికి ఏ ఆలయానికి వెళ్లినా ప్రసాదంగా పులిహోరా, పొంగలి, వడపప్పు, లడ్డూ, కలకండ, కొబ్బరి ముక్కలు వంటివి ప్రసాదంగా ఇస్తారనీ. కానీ, ఈ ఆలయంలో మాత్రం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలే ప్రసాదాలు. గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఇక్కడ ఇదే ఆనవాయితీ.
 
ప్రతి సంవత్సరం ఇక్కడ జనవరి 24 నుంచి రెండు రోజుల పాటు పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు మునియాండి ఆలయానికి వస్తారు. వారి కోసం 1000 కిలోల బియ్యం, 250 మేకపోతులు, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండుతారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఇదే ప్రసాదంగా అందిస్తారు. అంతేకాదు, ఆ బిర్యానీ ప్రసాదాన్ని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం కూడా ఉందిక్కడ.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments