Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కళాశాలలో వేధింపులు.. పీహెచ్‌డీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య

కళాశాలలో వేధింపులు.. పీహెచ్‌డీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య
, సోమవారం, 13 జనవరి 2020 (12:48 IST)
తమిళనాడు రాజధాని, చెన్నై నగరంలోని ఓ కళాశాలలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా ఇలాంటి ఘటనే సేలం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని సేలం జిల్లా పెరియార్ వర్శిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
నివేద అనే విద్యార్థిని పీహెచ్డీ రెండో సంవత్సరం చేస్తూ, ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంకా నివేద రాసిన రాసిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. కళాశాలలో వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడిందని తోటి విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. 
 
ఇటీవల వర్శిటీకి చెందిన ఓ ఉన్నతాధికారి, విద్యార్థినితో తప్పుగా ప్రవర్తించారని, దీనిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు కూడా చేసిందని విద్యార్థి సంఘాలు తెలియజేశాయి. నివేద కూడా ఆ అమ్మాయి విభాగమే కాబట్టి, పూర్తి పారద్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శబరిమల వివాదం-సుప్రీంలో వాదనలు: మహిళల ప్రవేశంపై జోక్యంపై సమీక్ష