డీఎంకేకు షాక్ : బీజేపీలో చేరిన మరో డీఎంకే ఎమ్మెల్యే

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (09:50 IST)
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. ఇప్పటికే థౌజెండ్‌ లైట్స్‌ నియోజకవర్గం డీఎంకే ఎమ్మెల్యే కె.కె. సెల్వం భాజపాలో చేరగా.. తాజాగా అదే పార్టీకి చెందిన తిరుప్ప నియోజకవర్గం ఎమ్మెల్యే పి.శరవణన్‌ ఆదివారం భాజపా తీర్థం పుచ్చుకున్నారు. 
 
రాష్ట్ర భాజపా అధ్యక్షుడు ఎల్‌. మురుగన్‌ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. జిల్లా స్థాయి పార్టీ కార్యవర్గాల ఆధిపత్యం.. వేధింపుల కారణంగానే తాను డీఎంకే పార్టీని వీడుతున్నట్లు శరవణన్‌ తెలిపారు. 
 
కొన్నేళ్ల కిందట భాజపాలోనే ఉన్న ఆయన ఆ తర్వాత డీఎంకేలో చేరారు. 2019లో జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఎలాగైనా ఈసారి అధికారం దక్కించుకోవాలని చూస్తోన్న తరుణంలో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో పార్టీ వర్గాలు కలవరపడుతున్నాయి. 
 
కాగా, శరవణన్ పార్టీ వీడటానికి మరో కారణం ఉంది. కూటమి పొత్తుల్లో భాగంగా, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాన్ని మిత్రపక్షాలకు కేటాయించారు. దీంతో ఈ దఫా తనకు పోటీ చేసే అవకాశం రాదని గ్రహించిన శరవణన్ ముందు జాగ్రత్తగా బీజేపీ కండువా కప్పుకుని, ఇపుడు మళ్లీ బరిలోకి దిగుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments