Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్డర్ డిలేః రెస్టారెంట్ ఓనర్‌నే చంపేసిన స్విగ్గీ డెలివరీ ఏజెంట్

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (15:20 IST)
స్విగ్గీకి చెందిన ఓ డెలివరీ ఏజెంట్ ఓ రెస్టారెంట్ ఓనర్‌నే చంపేసిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఆర్డర్ ఆలస్యమైన కారణంగా అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ డెలివరీ ఏజెంట్ కోసం గాలిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. సునీల్ అనే వ్యక్తి గ్రేటర్ నోయిడాలోని మిత్రా సొసైటీలో జామ్ జామ్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ఆర్డర్‌ను పికప్ చేసుకోవడానికి రెస్టారెంట్‌కు వచ్చాడు.
 
ఒక ఆర్డర్‌ను వెంటనే ఇచ్చిన రెస్టారెంట్‌లో పని చేసే వ్యక్తి.. మరో ఆర్డర్ లేటవుతుందని చెప్పాడు. దీంతో సదరు ఏజెంట్ ఆ వ్యక్తితో గొడవకు దిగాడు. గొడవను అడ్డుకోబోయిన యజమాని సునీల్‌ను ఆ స్విగ్గీ డెలివరీ బోయ్ కాల్చాడు. 
 
వెంటనే సునీల్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లినా.. అతడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఆ డెలివరీ ఏజెంట్‌తోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని, వాళ్లు అప్పటికే ఆల్కహాల్ మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments