Webdunia - Bharat's app for daily news and videos

Install App

కి'లేడీ' రియా చక్రవర్తి : ఏకంగా డ్రగ్స్ డీలర్లతో లింకులు... ఫోనులో మంతనాలు...

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (07:41 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ.. గత వారం రోజులుగా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, సీబీఐ కంటే ముందు.. బ్యాంకు ఖాతా నుంచి నిధుల తరలింపుపై సుశాంత్ ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారించింది. ఈ విచారణలో పలు ఆస్తికరమైన విషయాలు వెలుగు చూసింది. డ్రగ్స్ పేరుతో రియా చక్రవర్తికి నేరుగా సంబంధాలున్నట్లు ఈడీ తేల్చింది.
 
సుశాంత్ స్నేహితులు కూడా డ్రగ్స్ తీసుకునేవాళ్లని ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో వెల్లడైంది. రియా నేరుగా డ్రగ్స్ వ్యాపారులను సంప్రదించేదని ఈడీ తెలిపింది.  దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి ఈడీ తాజాగా లేఖ రాసింది. అలాగే, రియాకు డ్రగ్స్ డీలర్లకు మధ్య జరిగిన సంభాణలను కూడా ఈడీ అధికారులు సీబీఐ అధికారులతో పంచుకున్నారు. 
 
ఈడీ లేఖతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. సుశాంత్ కేసులో రియాను ఈడీ ఇప్పటికే రెండుసార్లు విచారించింది. కాగా, ఈడీ లేఖతో సుశాంత్ కేసు ఇపుడు కీలక మలుపు తిరిగింది. ఇపుడు రియాను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments