Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు... ఆక్సిజన్ సరఫరాకు టాస్క్‌ఫోర్స్

Webdunia
ఆదివారం, 9 మే 2021 (08:24 IST)
దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగిస్తోంది. ప్రతి రోజూ వేలాది మంది ప్రజలు ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. అదేసమయంలో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్‌ సరఫరాలోనూ కేంద్రం వివక్ష చూపుతోంది. దీంతో సుప్రీంకోర్టు రంగంలోకిదిగింది. 
 
కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశంలో ఆరోగ్య సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. మహమ్మారి నియంత్రణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని పలు దఫాలుగా తూర్పారబట్టిన సుప్రీంకోర్టు.. పరిస్థితులను చక్కదిద్దేందుకు నడుం బిగించింది. 
 
ఆక్సిజన్‌ అందక కరోనా రోగులు పిట్టల్లా రాలుతున్న దృశ్యాలు నిత్యకృత్యంగా మారడంతో.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, సమానరీతిలో ఆక్సిజన్‌ను పంపిణీ చేసే విధానాన్ని రూపొందించేందుకు 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. 
 
అలాగే కొవిడ్‌ చికిత్సకు అవసరమైన ఔషధాలకు కొరత ఏర్పడకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ టాస్క్‌ఫోర్స్‌ సూచనలు చేయనుంది. భవిష్యత్‌లో తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు సహకారం అందించనున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వసలు తెలుగేనా? నీ యాక్సెంట్ తేడాగా వుంది: మంచు లక్ష్మికి అల్లు అర్హ షాక్ (video)

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments