Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్ కోసం దేశాన్ని నాశనం చేశారు... మోడీపై మమతా ధ్వజం

Webdunia
ఆదివారం, 9 మే 2021 (08:18 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలు దేశాన్ని నాశనం చేశారంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేశారు. కేవలం అధికారమమే పరమావధిగా మోడీ - షా ధ్వజం పనిచేస్తోందన్నారు. ఇందుకోసం దేశాన్ని కాదు.. దేశ ప్రజల ప్రాణాలు కూడా హరించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదని ఆమె ఆరోపించారు. 
 
ఇదే అంశంపై మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ సంక్షోభానికి కేంద్రం నిర్లక్ష్యమే కారణమన్నారు. కేంద్రంలో ఉంటూ ఏ పని చేయకుండా, బెంగాల్‌పైనే దృష్టి సారించి, దేశాన్ని పట్టించుకోవడం మానేశారని విమర్శించారు. 
 
గత ఆర్నెల్లుగా ప్రతిరోజూ కేంద్రం పెద్దలు బెంగాల్‌ను సందర్శిస్తూనే ఉన్నారని, వారి ప్రయత్నాలన్నీ బెంగాల్‌ను చేజిక్కించుకునేందుకే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్‌ను వశం చేసుకునేందుకు దేశాన్ని నాశనం చేసినంత పనిచేశారని మమత మండిపడ్డారు.
 
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌గా తృణమూల్ ఎమ్మెల్యే బిమన్ బందోపాధ్యాయ్ మూడోసారి ఎన్నికైన సందర్భంగా మాట్లాడుతూ మమతా బెనర్జీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మత విద్వేషాలను ప్రేరేపించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఎన్నికల్లో ఓటమిపాలవడంతో బీజేపీ హింసను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును హర్షించలేని వాళ్లు ఫేక్ వీడియోల ద్వారా ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments