Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పీజీ అడ్మిషన్లకు అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (13:26 IST)
దేశ వ్యాప్తంగా నీట్ పీజీ అడ్మిషన్లకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేపట్టవచ్చని జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్. బొపన్నలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీచేసింది. అలాగే, నీట్ పీజీ ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్ కోటాను కూడా ఫిక్స్ చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించేందుకు పచ్చజెండా ఊపింది. దీంతో పీజీ కౌన్సెలింగ్‌పై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరబడింది. 
 
అదేసమయంలో ఆయా రాష్ట్రాల వైద్య కాలేజీల్లో అఖిల భారత కోటాలోని సీట్ల భర్తీలో పాత రిజర్వేషన్ విధానం వర్తిస్తుందని తెల్పింది. కాగా, నీట్ పీజీ కోటాపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవల రెసిడెంట్ వైద్యులు ఆందోళన చేశారు. అలాగే, ఒక రోజు వైద్య సేవలను కూడా బంద్ చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నీట్ పీజీ ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది. కాగా, ఈడబ్ల్యూఎస్ కోటాలో సీటు పొందేవారికి వార్షిక ఆదాయం రూ.8 లక్షల మేరకు ఉండాలన్న నిబంధన కూడా ఈ యేడాది వర్తించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments