Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (12:31 IST)
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కేంద్రం కల్పించడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సమర్థించింది. వీరికి పది శాతం కోటాను కల్పించడం రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్టు కాదని విస్తృత ధర్మాసనం అభిప్రాయపడింది. పైగా, ఈ నిర్ణయంలో ఎలాంటి వివక్షా లేదని స్పష్టం చేసింది. 
 
ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించగా, ఈ రిజర్వేషన్లను నలుగురు న్యాయమూర్తులు సమర్థించారు. జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం వ్యతిరేకించారు. 
 
కాగా, గత 2019 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను తీసుకొచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యా సంస్థల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు కాగా, తుది తీర్పును సోమవారం వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments