Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారిని బయటపడిన ఎంపీ సుమలత

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (16:43 IST)
ప్రముఖ సినీ నటి, లోక్‌సభ సభ్యురాలు సుమలత కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇపుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. అయితే కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొన్నారంటూ తనను చాలామంది మిత్రులు, ఇతరులు అడుగుతున్నారని సుమలత వెల్లడించారు. 
 
కరోనా చికిత్సలో మీరు ఎదుర్కొన్న అనుభవాలేంటి? మీ పోరాటం ఎలా సాగింది? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని, అలాంటివారందరి కోసం రేపు ఇన్ స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొంటున్నట్టు వివరించారు. 
 
బుధవారం సాయంత్రం 5.30 గంటలకు డాక్టర్ చైత్ర సాయంతో అందరి సందేహాలు నివృత్తి చేస్తానని సుమలత వెల్లడించారు. తన కరోనా అనుభవాలు ఏ కొందరికైనా ఉపయోగపడితే అదే చాలని ఆమె తెలిపారు.
 
కాగా, భర్త అంబరీష్ చనిపోయిన తర్వాత సుమలత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మాండ్యా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత లోక్‌సభలో ఆమె కర్నాటక రాష్ట్రంలోని మాండ్య స్థానం ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments