ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన సుధా నారాయణ మూర్తి.. కలాం ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని చెప్పా...

వరుణ్
బుధవారం, 26 జూన్ 2024 (10:53 IST)
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధా నారాయణ మూర్తి తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ఒకసారి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, తాను రాసిన కాలమ్స్ చదివి ఆస్వాదించానంటూ ఆయన చెప్పారని సుధామూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంగళవారం ఆమె ఒక ఆడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఇందులో అబ్దుల్ కలామ్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో ఓ సందర్భంలో చెప్పిన విషయాలు ఉన్నాయి. 
 
రాష్ట్రపతి భవన్ నుంచి ఫోన్ కాల్ వస్తే 'రాంగ్ కాల్' అని (ఆపరేటర్‌కి) తాను సమాధానం ఇచ్చానని సుధామూర్తి వెల్లడించారు. తన భర్త నారాయణ మూర్తికి చేయబోయి తనకు చేశారేమో అనుకున్నానని, అందుకే రాంగ్ అని కాల్ చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే 'అబ్దుల్ కలాం ప్రత్యేకంగా మీ పేరే చెప్పారు' అనడంతో తాను ఆందోళనతో పాటు ఆశ్చర్యపోయానని, ఏం చేశానని కాల్ చేస్తున్నారో అర్థం కాలేదని గుర్తుచేసుకున్నారు. అయితే 'ఐటీ డివైడ్' పేరిట తాను రాసిన కాలమ్‌ను చదివి ప్రశంసించడానికి అబ్దుల్ కలాం ఫోన్ చేశారని, చాలా బావుందంటూ తనను మెచ్చుకున్నారని సుధామూర్తి ప్రస్తావించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments