Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ... ఎట్టకేలకు సమ్మతం

వరుణ్
బుధవారం, 26 జూన్ 2024 (10:37 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు సమ్మతం తెలిపారు. లోక్‌సభలో విపక్ష నేతగా ఉండేందుకు ఆయన అంగీకారం తెలిపారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల పోటీ చేసి విజయం సాధించారు. ఇపుడు ఒక స్థానాన్ని త్యజించారు. అదేసమయంలో రాహుల్‌ను లోక్‌సభలో కూటమి తరపున విపక్ష నేతగా ఎన్నికయ్యారు.
 
మంగళవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్లు సమావేశమయ్యారు. వారందరూ లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌‌కు మద్దతు తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల నేతలందరూ లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీని బలపరిచారని తెలిపారు.
 
స్పీకర్ పదవి కోసం తీవ్రస్థాయిలో పోరాటం జరుగుతున్న నేపథ్యంలో, ఇండియా కూటమి నుంచి విపక్ష నేత ప్రకటన వెలువడింది. డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి అభ్యర్థికి ఇచ్చేందుకు ఎన్డీయే ససేమిరా అనడంతో, స్పీకర్ పదవికి ఎన్నిక జరపాల్సిందేనని ఇండియా కూటమి పట్టుబట్టడం తెలిసిందే. లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్డీయే తరపున ఓం బిర్లా బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో కేరళ ఎంపీ కె.సురేశ్‌ను పోటీలోకి దించింది. దీంతో పుష్కర కాలం తర్వాత లోక్‌సభలో స్పీకర్ పదవికి ఎన్నిక జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments