Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై.. పాలు ప్యాకెట్ వేస్తున్నట్లు వెళ్లి.. మహిళపై అత్యాచార యత్నం..?

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:52 IST)
woman
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో వున్న తరుణంలో.. పాలు పాకెట్ వేసినట్లు వేసినట్లు డ్రామా చేసి ఓ మహిళపై అత్యాచారానికి యత్నించాడు.. ఓ కామాంధుడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాజధాని చెన్నై, తిరుమంగళంలో నేపాల్‌కు చెందిన దంపతులు నివసిస్తున్నారు. భర్త సెక్యూరిటీ ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో భార్య మాత్రమే ఇంట్లో ఒంటరిగా వుంటుంది. 
 
ఈ విషయాన్ని గమనించిన ఓ కామాంధుడు ఆమెపై కన్నేశాడు. పాల ప్యాకెట్ వేస్తున్నట్లు ఉదయం పూట వచ్చిన ఆ కామాంధుడు మహిళపై అత్యాచారానికి యత్నించాడు. కానీ సదరు మహిళ ప్రతిఘటించడంతో పారిపోయాడు. 
 
భర్త వచ్చిన తర్వాత ఈ విషయాన్ని భార్య చెప్పడంతో..పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలో సీసీటీవీ ఆధారంగా మహిళపై అత్యాచారానికి యత్నించిన రామకృష్ణన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments