Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్భిణిని కాటేసిన కరోనా వైరస్.. నిండు గర్భిణి బలి

గర్భిణిని కాటేసిన కరోనా వైరస్.. నిండు గర్భిణి బలి
, మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (11:05 IST)
కరోనా వైరస్ నిండు గర్భిణి మహిళను కాటేసింది. కరోనా వైరస్‌ కాటుకు తొమ్మిది నెలల నిండు గర్భిణి బలైంది. ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లసోపారా ప్రాంతానికి చెందిన ఓ మహిళ శ్వాస తీసుకోవటంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న స్థితిలో శనివారం రాత్రి ముంబైలోని బివైఎల్‌ నాయర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
 
ఈమె పరిస్థితిని బట్టి కరోనా ఉండొచ్చని అంచనా వేసిన వైద్యులు ఆమెను వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు తరలించి, అత్యవసర చికిత్స అందించారు. కరోనా నిర్ధారణ పరీక్ష కూడా చేశారు. అయితే ఆమె ఆరోగ్య స్థితి మరింత దిగజారటంతో... కొద్ది గంటల్లోనే మృతిచెందింది. 
 
గర్భంలోని శిశువు కూడా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం వెలువడిన కొవిడ్‌-19 పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, నాయర్‌ ఆస్పత్రికి తీసుకురావటానికి ముందు ఆమెను చేర్చుకోవటానికి రెండు ఆస్పత్రులు తిరస్కరించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాప్రభో మలేరియా మాత్రలు ఇవ్వండి .. ట్రంప్ :: నిర్ణయం తీసుకోని మోడీ